బెంగళూరు సెంట్రల్‌ నుంచి ప్రకాశ్‌రాజ్‌  | Prakash Raj to Contest from Bengaluru Central | Sakshi
Sakshi News home page

బెంగళూరు సెంట్రల్‌ నుంచి ప్రకాశ్‌రాజ్‌ 

Jan 19 2019 9:43 AM | Updated on Mar 9 2019 3:34 PM

Prakash Raj to Contest from Bengaluru Central - Sakshi

శివాజీనగర(కర్ణాటక): లోక్‌సభ ఎన్నికల్లో  బెంగళూరు సెంట్రల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. ప్రస్తుతమున్న ఏ పార్టీలోనూ నిజాయితీ లేదని, అందువల్ల ఏ పార్టీలోనూ చేరబోనన్నారు. బెంగళూరులోని మార్థాస్‌ ఆస్పత్రిలో జన్మించానని, చామరాజపేట, శాంతినగరలలో కొన్నాళ్లు నివాసం ఉన్నానని చెప్పారు.  

‘జస్ట్‌ ఆస్కింగ్‌’ ద్వారా తాను అడిగిన ఏ ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదన్నారు. పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన నేతలు.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా ఎవరో ఒకరి చెప్పుచేతల్లో ఉండిపోతున్నారని విమర్శించారు. త్వరలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తానన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement