
సాక్షి, చిత్తూరు : అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర 50వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం సీటీఎం నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.
నేటి పాదయాత్ర పులవండ్ల పల్లి, కాశీరావు పేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలనీ, పునుగుపల్లి, విఠలం, టీఎమ్ లోయ మీదుగా జమ్మిలవారిపల్లి వరకు కొనసాగుతుంది.