
సాక్షి, చిత్తూరు : ప్రజాసంకల్పయాత్ర 48వ రోజు షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి తలశిల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం మూలపల్లి క్రాస్ నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఆపై యాత్ర ఎర్రసానిపల్లె, ఎద్దులవారిపల్లె, కన్నెమడుగు, కె రామిగానివారిపల్లో, రేణుమాకులపల్లి క్రాస్, మీదుగా తిమ్మయ్యగారిపల్లి చేరుకుంటుంది.
ఆపై పరదేశిపల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్ మీదుగా ముదివేడు వరకు చేరుకుని అక్కడ ముగుస్తుంది. ఇక పాదయాత్రలో వైఎస్ జగన్ కన్నెమడుగు, దాదంవారిపల్లో, ముదివేడుల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఎద్దులవారిపల్లె, రేణుమాకులపల్లె క్రాస్, పరదేశీపల్లెక్రాస్, తూపల్లిక్రాస్లో ఆయన జనంతో మమేకం కానున్నారు.