సాగర్నగర్ (విశాఖ తూర్పు): దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి గెలవాలని మంత్రి నారా లోకేశ్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గెలుస్తాడన్న నమ్మకం లేకే చంద్రబాబు లోకేశ్ని దొడ్డి దారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన నెత్తిన రుద్దుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పెదరుషికొండ ఐటీ సెజ్ ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన జనసేన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు నెలకొన్నా పరిష్కారం చూపే దిక్కులేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సామాజిక, రాజకీయ రంగాల్లో సమూల మార్పులు తెస్తామని చెప్పారు.
తనకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేతకావని, మానవత్వంతో కూడిన రాజకీయాల కోసమే జనసేన స్థాపించినట్లు పేర్కొన్నారు. సీట్లు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం రాదన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వస్తే మార్పు వస్తుందని ఆశించి, మద్దతు ఇచ్చి ఓట్లు వేయిస్తే వాళ్లు ప్రజలకు చేసింది సున్నా అని మండిపడ్డారు. 65 ఏళ్ల వయస్సులో కూడా సీఎం చంద్రబాబుకి డబ్బు, పదవి మీద ఆశ చావలేదని విమర్శించారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రలో ఏ మూలకు వెళ్లినా సమస్యలేనని, యువతకు ఉద్యోగాల్లేవు, కార్మికులకు ఉపాధి లేదన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఉపాధి కోసం పొట్ట చేతపట్టి దాదాపు 44 వేల మందికిపైగా వలసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల మంది జూట్ కార్మికులు రోడ్డున పడ్డారని.. ఈ పరిస్థితినే తాను ప్రశ్నిస్తున్నానన్నారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అవగాహన లేదంటున్నారు...
అన్యాయాన్ని ప్రశ్నిస్తే తనకు అవగాహన లేదంటున్నారని.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జగన్ తమ అనుచరులతో వస్తే.. తానొక్కడినే ఏ పాలసీపైనైనా చర్చించడానికి సిద్ధమన్నారు. తెలుగుదేశం పార్టీకి భావజాలం లేదని, జనసేనకు అది పుష్కలంగా ఉందన్నారు. జనసేన చెబితేగానీ వాళ్లకు ఉద్దానం సమస్య గుర్తుకు రాలేదని విమర్శించారు. తాను వెళితే కానీ వాళ్లు తుమ్మపాల చెక్కర ఫ్యాక్టరీని పట్టించుకోరన్నారు. కాగా, విశాఖకు చెందిన పలువురు జనసేనలో చేరారు. సురక్ష గ్రూప్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, బోడేపల్లి శ్రీరామ్మూర్తి, డాక్టర్ మౌనితేజ మహారాజ్, చింతల రమణ, డాక్టర్ ఐ.ప్రకాష్, బి.జయరాజ్, కోరాడ సర్వేశ్వరావు, రాకేష్ మహదేవ్, పసుపులేటి రామారావులకు పవన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలువు
Published Mon, Jul 9 2018 3:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
కళతప్పిన జీవనదులు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఢిల్లీ రేసులోకొచ్చింది!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement