సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డును సీఎం కేసీఆర్ తిరగరాస్తారని మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక టీడీపీ కనుమరుగు అయినట్లేనని, ఢిల్లీ మోచేతి నీళ్లు తాగుతున్న కాంగ్రెస్కు ఇక్కడ పుట్టగతులు ఉండవన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కర్రు నాగయ్య బుధవారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రులు కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఈటల రాజేందర్.. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చరిత్రలో కొన్ని మలుపులు అని వార్యంగా వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అంతమొందించేందుకు ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. గండ్ర సత్యనారాయణరావు చేరికతో భూపాలపల్లి జిల్లాలో టీఆర్ఎస్కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం ఇక బంద్ అని కడియం వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలవాలని ఈటల పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో ప్రజలు పార్టీకి ఎలా అండగా నిలబడ్డారో ఇప్పుడు ప్రభుత్వానికి అండగా నిలిచి తెలంగాణ పునర్నిర్మాణంలో బాధ్యులు కావాలని ఎంపీ బి.వినోద్ కోరారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సత్యనారాయణ రావు, నరసింగరావు, నాగయ్యలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పుట్ట మధు పాల్గొన్నారు.
జ్యోతిబసు రికార్డును కేసీఆర్ తిరగరాస్తారు
Published Thu, Nov 16 2017 3:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లోన గుబులు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా
రైల్లోంచి పడి వ్యక్తి మృతి
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
బైక్లు ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్
పెంచలకోన ఆలయానికి భారీ ఆదాయం
సేవాతత్పరుడు జేఎస్ రెడ్డి
భార్య లేదన్న మనస్తాపంతో..
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
తప్పక చదవండి
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
- అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ‘వర్జిన్ ఓటర్’గా మిగలకండి!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement