దృష్టి మళ్లించడానికే.. థర్డ్‌ ఫ్రంట్‌పై కె. లక్ష్మణ్‌ | Laxman commented over third front | Sakshi
Sakshi News home page

దృష్టి మళ్లించడానికే.. థర్డ్‌ ఫ్రంట్‌పై కె. లక్ష్మణ్‌

Mar 7 2018 2:25 AM | Updated on Aug 15 2018 9:04 PM

Laxman commented over third front - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై చేస్తున్న ఉద్యమా లపై అమిత్‌ షాకు నివేదించినట్టు లక్ష్మణ్‌ తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తెలంగాణలో కూడా పర్యటించి రాష్ట్ర పార్టీ ఉద్యమాల్లో భాగం పంచుకుంటానని అమిత్‌ షా చెప్పారన్నారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement