సాక్షి, అమరావతి: తనను దెబ్బతీసేందుకే రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు పెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తొలి విడత ఎన్నికలు ఎప్పుడూ పెట్టలేదని ఈసారి కావాలని పెట్టారని, అభ్యర్థుల ఎంపిక, ఏర్పాట్లు చేసుకోలేననుకుని ఇలా చేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా అనే దానిపై సూటిగా సమాధానం చెప్పకుండా జాతీయ రాజకీయాల్లో అవసరమైతే కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు ఇప్పటికి లేదని తెలిపారు. తెలంగాణలో టీడీపీ పోటీలో ఉంటుందా అనే దానిపైనా తప్పించుకునే ధోరణిలో సమాధానమిచ్చారు.
అక్కడి రాష్ట్ర పార్టీ నిర్ణయానికి పోటీ చేయాలా..వద్దనే విషయాన్ని వదిలేశామని వారే చూసుకుంటారని తెలిపారు. రాష్ట్రం పట్ల కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి, ప్రధాని మోడీ కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ సీబీఐ డైరెక్టర్ 2017లో రాసిన లేఖను బయటపెట్టారు. జగన్ను కేసీఆర్, మోడీ లొంగదీసుకున్నారని, దానికి ఈ లేఖే ఉదాహరణని చెప్పారు. ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకి 2017 మే 30న ఈ లేఖ రాశారని తెలిపారు. ఈడీ డైరెక్టర్ లేఖ రాసి రెండేళ్లైందని, మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఒకటి, రెండు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అంతకుముందు టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. రెండురోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో, ఆడియో సాంగ్స్ విడుదల చేస్తామని తెలిపారు. 15వ తేదీ నుంచి సేవామిత్రలు, బూత్ కన్వీనర్లతో జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తానని చెప్పారు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
నన్ను దెబ్బ కొట్టేందుకే తొలి విడతలో ఎన్నికలు
Published Thu, Mar 14 2019 4:21 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
సదుపాయాల విషయం లో అధికారులు అప్రమత్తం అవ్వాలి
అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్ మార్కెట్లపై అమిత్షా
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
సీఎం ఇంట్లో నాపై దాడి చేశారు: ‘ఆప్’ ఎంపీ సంచలన ఆరోపణలు
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement