'మోడీ ప్రభుత్వ తీరును ఆరు నెలలు పరిశీలిస్తాం'
జాన్ పూర్: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరును ఆరునెలలు పరిశీలించిన తర్వాతనే సమాజ్ వాదీ పార్టీ స్పందిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆరునెలలు తర్వాతనే తాను కామెంట్ చేస్తాను. ఆలోపు మోడీ పనితీరు పరిశీలిస్తాను అని అఖిలేష్ మీడియాకు తెలిపారు.
సమాజ్ వాదీ పార్టీ నేత సతాయ్ రామ్ సంతాప సభకు హాజరైన అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ...ప్రభుత్వ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నాం అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్యుత్ కొరత కారణంగానే కోతలు విధిస్తున్నామని.. త్వరలోనే కోతలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.