ముంబయి: తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకొస్తానని అనవసరం ప్రచారం చేయొద్దని, అలాంటి ఊహాగానాలకు తెరదించాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. పద్మ విభూషణ్ పురస్కారం పవార్కు దక్కిన నేపథ్యంలో ఆయనను కలిసిన మీడియాలో పలు విషయాలు మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రశ్నించగా.. ‘కేవలం పన్నెండు మంది ఎంపీలను కలిగిన ఓ వ్యక్తి అంత పెద్ద స్థాయిని(రాష్ట్రపతి హోదా) ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరాదు.
లోక్ సభలో, రాజ్యసభలో నా బలమెంతో నాకు బాగా తెలుసు. మొత్తం కలిపి నా దగ్గర ఉందే 12మంది ఎంపీలు. వారి సహాయంతో అది ఆశించకూడదు’ అని స్పష్టం చేశారు. ఇక ప్రధాని పదవిపై ఆయనకున్న శక్తి సామర్థ్యాలను ప్రశ్నించగా దేశంలో అలాంటి శక్తి గలవారు చాలామంది ఉన్నారని, అయితే, వారిలో ఒకరికి రాజకీయ శక్తిసామర్థ్యాలు అవసరం అని అన్నారు. రాజకీయాల్లో శక్తిసామర్ధ్యాలు చూడరని, రాజకీయ బలమే ముఖ్యం అని అన్నారు. తనకు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డును రైతులకు అంకితం ఇస్తున్నాని చెప్పారు. మొత్తం దేశానికి తాను చేసిన సేవలు గుర్తించే ఈ పురస్కారం లభించిందని తాను భావిస్తున్నానని అన్నారు.
76 ఏళ్ల తాను రాజకీయ క్షేత్రంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్నానని, ఇది దేశం మొత్తం గుర్తించాల్సిన అంశం అన్నారు. దేశంలో దేశం వెలుపలా చేసిన అద్భుత కృషికి తనకు ఎన్నో అవార్డులు, డాక్టరేట్లు దక్కిన విషయం గుర్తు చేశారు. కానీ, తనను పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
‘నాకుంది 12మంది ఎంపీలే.. నేనెలా రాష్ట్రపతిగా..’
Published Thu, Jan 26 2017 7:33 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
సన్రైజర్స్ ఫ్యాన్స్తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
లండన్ చేరుకున్న సీఎం జగన్
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
తప్పక చదవండి
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- మీటింగ్కు రమ్మనేవారు.. ఆడిషన్ మాత్రం కాదనేవారు!: నటి
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement