సుప్రీంలో తెలంగాణ సర్కార్‌కు ఊరట | Supreme Court Cancels Petition Against Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Feb 23 2018 1:15 PM | Updated on Oct 30 2018 7:50 PM

Supreme Court Cancels Petition Against Kaleshwaram Project - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. పిటిషన్‌ను దాఖలు చేసిన పిటిషనర్‌ను కోర్టు మందలించింది. ముంపు గ్రామాల్లో సరైన చర్యలు చేపట్టకుండా పనులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సుప్రీం శుక్రవారం విచారణ చేపట్టిఒంది. చెన్నై బెంచ్‌ నుంచి ఢిల్లీకి ఎందుకు వచ్చారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. ఫోరం హంటింగ్‌ చేస్తున్నారా అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దాఖలులోనే ఆలస్యం చేశారని కోర్టు పేర్కొంది. ఒక చోట కాకపోతే మరో చోటికి వస్తారా అంటూ చురకలంటించింది. కేసు విచారణకు అర్హం కాదంటూ, పిటిషనర్ ఆలోచన సరిగా లేదంటూ.. పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 

సుప్రీం తీర్పు చెంపపెట్టు: హరీష్‌రావు
సుప్రీం కోర్టు తీర్పుపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుకు హరీష్‌రావు, అడిషనల్‌ ఎజీ రామంచంద్రరావు, ఇంజనీర్లు హాజరయ్యారు. కేసు వాదనలను మంత్రి స్వయంగా పరిశీలించారు. పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని సీఎం కేసీఆర్‌కు హరీష్‌రావు ఫోన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కుటిల యత్నాలకు సుప్రీం తీర్పు చెంపపెట్టు అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ 100 పైగా పిటిషన్లు వేసిందని గుర్తు చేశారు. పిటిషన్ల వెనుక ఎవరున్నది త్వరలో అసెంబ్లీలో బయటపెడతామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పాకులాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి కల్లా కాళేశ్వరం నీటిని రైతులకు అందిస్తామన్నారు. నేటి తీర్పుతో తెలంగాణ రైతుల కాల సాకారం కానుందని ఆనందం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement