సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో | Karti Chidambaram refuses to appear before CBI in Aircel Maxis case | Sakshi
Sakshi News home page

సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో

Sep 14 2017 6:23 PM | Updated on Sep 19 2017 4:33 PM

సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో

సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నో

ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ చిదంబరం నిరాకరించారు.

సాక్షి,న్యూఢిల్లీః ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ చిదంబరం నిరాకరించారు. 2006లో కార్తీ తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఓ విదేశీ పెట్టుబడి క్లియరెన్స్‌కు సంబంధించి ప్రశ్నించేందుకు హాజరుకావాలని ఆయనను సీబీఐ కోరింది. ఈ అంశంలో నిందితులపై ఆరోపణలను ప్రత్యేక కోర్టు తిరస్కరించిందని చెబుతూ సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కార్తీ నిరాకరించారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ సమాచారాన్ని సీబీఐకి చేరవేశామని ఆయన న్యాయవాది అరుణ్‌ నటరాజన్‌ చెప్పారు.
 
మరోవైపు రాజకీయ కోణంలోనే తమ కుమారుడిని కేసుల పేరుతో ప్రభుత్వం వేధిస్తోందని మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఆరోపిస్తున్నారు. ఎఫ్‌ఐపీబీ అనుమతులు రొటీన్‌గా ఇచ్చేవేనని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement