చెన్నైలో ఐటీ దాడులు | IT Raids In Tamil Nadu | Sakshi
Sakshi News home page

చెన్నైలో ఐటీ దాడులు

Apr 12 2019 10:51 AM | Updated on Apr 12 2019 10:53 AM

IT Raids In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రైవేటు సంస్థలు, ఫైనాన్షియర్ల గృహాలు, కార్యాలయలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పీఎస్కే కన్‌స్ట్రక్షన్‌ సంస్థకు చెందిన కార్యాలయాలపై 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. అలాగే చెన్నై, తిరునల్వేలిలలోని ఆకాశ్‌ భాస్కర్‌, సుజయ్‌ రెడ్డి అనే ఫైనాన్షియర్లల నివాసాలు, కార్యాలయాలపై 11 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్నికల్లో భారీగా నగదు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఐటీ అధికారులు ఈ దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రెండో దశలో భాగంగా తమిళనాడులోని అన్ని పార్లమెంట్‌ స్థానాలకు ఏప్రిల్‌ 18న పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement