హైదరాబాద్ పరిణామాలపై కేంద్రం కన్ను | high command observes carefully ongoing of state issues | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ పరిణామాలపై కేంద్రం కన్ను

Sep 7 2013 4:40 AM | Updated on Apr 7 2019 3:47 PM

తెలంగాణ జేఏసీ అదే రోజు తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వటం వంటి పరిణామాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది.

సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఏపీఎన్‌జీవోలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో సమైక్య సభ నిర్వహిస్తుండటం.. మరోవైపు దానికి ప్రతిగా అన్నట్లు తెలంగాణ జేఏసీ అదే రోజు తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వటం వంటి పరిణామాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. శనివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకోగల పరిణామాల ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు చేపట్టే అవకాశముందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement