దేశ రాజధానిలో గురువారం నైజీరియా మహిళను కారులో ఎక్కించుకొన్న నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గురువారం నైజీరియా మహిళను కారులో ఎక్కించుకొన్న నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని సాకేత్ నుంచి తన ఇంటి వద్ద దించుతామని లిఫ్ట్ ఇచ్చిన దుర్మార్గులు, ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులో అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను చిల్లా గ్రామంలో వదిలి వెళ్లారు. శుక్రవారం ఉదయం 2:40 గంటలకు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసిన సెక్యూరిటీ గార్డులు ఆసుపత్రిలో చేర్పించి తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. మయూర్ విహార్కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. నిందితులు ఆమె డబ్బులు, మొబైల్ కూడా దొంగలించారు.