2020 నుంచి బీఎస్‌–6 వాహనాలే | BS-6 vehicles from 2020 onwards | Sakshi
Sakshi News home page

2020 నుంచి బీఎస్‌–6 వాహనాలే

Jun 18 2019 4:58 AM | Updated on Jun 18 2019 4:58 AM

BS-6 vehicles from 2020 onwards - Sakshi

న్యూఢిల్లీ: 2020 నుంచి దేశంలో బీఎస్‌–6 ప్రమాణాలున్న వాహనాలే అందుబాటులో ఉంటాయని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ‘బీఎస్‌–6 ఇంధనాన్ని ఇప్పటికే ఢిల్లీలో వాడుతున్నాం. వచ్చేఏడాది నాటికి దేశవ్యాప్తంగా బీఎస్‌–6 ఇంధనంతో నడిచే వాహనాలే ఉంటాయి. కాలుష్యం అన్నది ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మొత్తం కాలుష్యంలో దాదాపు 22 శాతం కేవలం వాహనాల వల్లే వస్తోంది. కాలుష్యంపై పోరాడాల్సిందే. పంజాబ్‌–హరియాణా రాష్ట్రాల్లో ఇటీవల పంట వ్యర్థాల దహనం తగ్గింది. ఢిల్లీ శివార్లలో ఇటుక బట్టీలను మూయించేశాం’ అని జవదేకర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement