రశ్మిపై దాడి ఘటనపై విచారణకు సీఎం ఆదేశం | Attacked on IAS officer | Sakshi
Sakshi News home page

రశ్మిపై దాడి ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

Oct 16 2014 8:48 PM | Updated on Sep 27 2018 3:20 PM

రశ్మిపై దాడి ఘటనపై విచారణకు సీఎం ఆదేశం - Sakshi

రశ్మిపై దాడి ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

మైసూరులోని అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ జనరల్‌ రశ్మిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఆదేశించారు.

బెంగళూరు: మైసూరులోని అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటిఐ)డెరైక్టర్ జనరల్‌  రశ్మిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఆదేశించారు. మెస్ మేనేజర్ వెంకటేష్ మరణానికి ఐఏఎస్ అధికారి రశ్మి  కారణం అని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు  పలువురు  బుధవారం ఆమెపై రాళ్లు రువ్వారు. చెప్పులతో దాడి చేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి.
 
 సంప్‌లోని నీటి పరిమాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వెంకటేష్ ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయారు. అయితే  సీనియర్ ఐఏఎస్ అధికారిణి రశ్మి  వేధింపుల వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని వెంకటేష్ కొడుకు ఆరోపించాడు.  ఈ ఘటనకు సంబంధించి 16 మందిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement