కోటి విరాళమిచ్చిన ఏజీ

AG Venugopal donates Rs 1 crore - Sakshi

న్యూఢిల్లీ:  కేరళలో సహాయ కార్యక్రమాల కోసం కేంద్ర అటార్నీ జనరల్‌ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ కోటి రూపాయలు విరాళమిచ్చారు. ఈ మొత్తాన్ని  ముఖ్యమంత్రి సహాయ నిధికి  పంపారు. వేణుగోపాల్‌ కొడుకు, సీనియర్‌ న్యాయవాది క్రిష్ణన్‌ కూడా మరో రూ.15 లక్షలను కేరళకు విరాళమిచ్చారు. న్యాయమూర్తులు జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లు చెప్పుకోదగ్గ డబ్బును విరాళంగా ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఐఏఎస్‌ అధికారులంతా కూడా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఏపీ ఐఏఎస్‌ అధికారుల సంఘం ప్రకటించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top