ముగ్గురి జవాన్ల మృతి | 3 Soldiers Killed After Avalanche Hits Army Camp | Sakshi
Sakshi News home page

Feb 2 2018 8:26 PM | Updated on Feb 2 2018 8:28 PM

 3 Soldiers Killed After Avalanche Hits Army Camp - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్‌ సెక్టార్‌, ఉత్తర కశ్మీర్‌, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయపడ్డారు.

బుధవారం అఫ్ఘనిస్తాన్‌- తజకిస్తాన్‌ సరిహద్దుల్లో భూమి కంపించడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కశ్మీర్‌లోని పలు జిల్లాలకు గువారమే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement