ముగ్గురి జవాన్ల మృతి | 3 Soldiers Killed After Avalanche Hits Army Camp | Sakshi
Sakshi News home page

Feb 2 2018 8:26 PM | Updated on Feb 2 2018 8:28 PM

 3 Soldiers Killed After Avalanche Hits Army Camp - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్‌ సెక్టార్‌, ఉత్తర కశ్మీర్‌, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయపడ్డారు.

బుధవారం అఫ్ఘనిస్తాన్‌- తజకిస్తాన్‌ సరిహద్దుల్లో భూమి కంపించడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కశ్మీర్‌లోని పలు జిల్లాలకు గువారమే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement