ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ వాయిదా!

SV Rangarao Statue Inauguration Postponed - Sakshi

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని తాడేపల్లిగూడెం, ఎస్వీఆర్‌ సర్కిల్‌లో ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెయన్‌ రోడ్‌లో ఆదివారం ఉదయం విగ్రహష్కరణకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మెగాస్టార్‌చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఆయన చేతులమీదుగానే విగ్రహావిష్కరణ జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.

అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా విగ్రహావిష్కణ వాయిదా పడిందని, త్వరలోనే మరో తేదిని ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. విగ్రహావిష్కరణకు పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top