పాపం వర్మ.. ఏం చేస్తున్నాడో? | Social Media troll with RGV after Sridevi Death | Sakshi
Sakshi News home page

Feb 26 2018 7:54 PM | Updated on Oct 22 2018 6:05 PM

Social Media troll with RGV after Sridevi Death  - Sakshi

సాక్షి, సినిమా : నటి శ్రీదేవి హఠాన్మరణం ఆమె కుటుంబ సభ్యులను, అమితంగా అభిమానించే వారిని ఎంత దిగ్భ్రాంతికి గురి చేసిందో చెప్పనక్కర్లేదు. అయితే ఆమెను ఆరాధ్య దేవతగా భావించే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను మాత్రం ఆ వార్త కుదిపేసింది.

ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి మొదలైన ట్వీట్ల పర్వం ఆదివారం అంతా కొనసాగింది. దేవుడ్ని నిందిస్తూ... పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... తనకు చెప్పకుండా వెళ్లిపోయావంటూ నీతో(శ్రీదేవి) కటీఫ్‌​ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వర్మ.. ఇవాళంతా మూగబోయాడు. దీంతో ఆయనసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేర్‌ ఈజ్‌ ఆర్జీవీ? అంటూ సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. 

కొందరేమో ఈ బాధను తట్టుకోలేక వర్మ అందరికీ దూరంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని అంటుండగా.. ఆ బాధ నుంచి వర్మ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కడసారి చూపుల కోసం ముంబై వెళ్లి ఉంటాడని ఇంకొందరు చెబుతున్నారు. ఎవరి ఊహకు అందని వర్మ మళ్లీ ఏ క్షణానైనా స్పందిచొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి మృతిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలోనైనా వర్మ ఏదో ఒకటి రియాక్ట్‌ అవుతాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement