'కరీనా, అజయ్‌లతో షూటింగ్ సరదాగా ఉంటుంది' | Shooting with Kareena and Ajay always fun, says Rohit Shetty | Sakshi
Sakshi News home page

'కరీనా, అజయ్‌లతో షూటింగ్ సరదాగా ఉంటుంది'

May 18 2014 7:34 PM | Updated on Sep 2 2017 7:31 AM

కరీనా కపూర్, అజయ్ దేవ్‌గణ్‌లతో షూటింగ్ బాగా సరదాగా ఉంటుందని దర్శకుడు రోహిత్‌శెట్టి పేర్కొన్నాడు.

న్యూఢిల్లీ: కరీనా కపూర్, అజయ్ దేవ్‌గణ్‌లతో షూటింగ్ బాగా సరదాగా ఉంటుందని దర్శకుడు రోహిత్‌శెట్టి పేర్కొన్నాడు. ఈ జంటతో కలిసి సింఘం-2 తీస్తున్న 41 ఏళ్ల రోహిత్... గతంలో అజయ్‌తో గోల్‌మాల్, గోల్‌మాల్ రిటర్న్స్-3 తదితర అనేక సినిమాలు తీశాడు. సింఘం-2 తీస్తున్న సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ అజయ్ దేవ్‌గణ్, కరీనా కపూర్ జంటగా మరోసారి సినిమా తీయడం ఆనందం కలిగిస్తోందన్నాడు. కరీనాకపూర్ మా కుటుంబ సభ్యురాలుగా, అజయ్ నాకు సోదరుడి మాదిరిగా అనిపిస్తుందన్నాడు. అందువల్లనే సెట్‌వద్ద ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందన్నాడు. అసలు తనకు సినిమా షూటింగ్ చేస్తున్నట్టే ఉండదన్నాడు.

 

కాగా కరీనా, అజయ్ జంటగా సింఘంకు సీక్వెల్‌గా వస్తున్న సింఘం 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో  జరుగుతోంది. ‘ఈ సినిమాలో అజయ్ పోలీసు అధికారి బాజీరావ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో కరీనాకపూర్ ప్రేయసి పాత్రలో కనిపిస్తుంది.  గోవాలో 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మిగతా భాగమంతా  ముంబైలో తీస్తాం. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే భాగాన్ని గోవా పరిసరాల్లో తీస్తున్నాం’ అని అన్నాడు. 2003లో జమీన్ సినిమాతో రోహిత్... బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement