కరీనా కపూర్, అజయ్ దేవ్గన్తో షూటింగ్ బాగా సరదాగా ఉంటుందని దర్శకుడు రోహిత్శెట్టి పేర్కొన్నాడు. ఈ జంటతో కలిసి సింగం-2 తీస్తున్న 41 ఏళ్ల రోహి త్... గతంలో అజయ్తో గోల్మాల్, గోల్మాల్ రిటర్న్స్-3 తదితర అనేక సినిమాలు తీశాడు. సింగం-2 తీస్తున్న సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ అజయ్ దేవ్గన్, కరీనా కపూ ర్ జంటగా మరోసారి సినిమా తీయడం ఆనందం కలిగి స్తోందన్నాడు. కరీనాకపూర్ మా కుటుం బ సభ్యురాలుగా, అజయ్ నాకు సోదరుడి మాదిరిగా అనిపిస్తుందన్నాడు. అందువల్లనే సెట్ వద్ద ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందన్నాడు. అసలు తనకు సినిమా షూటింగ్ చేస్తున్నట్టే ఉండదన్నాడు. కాగా కరీనా, అజయ్ జంటగా సింగంకు సీక్వెల్గా వస్తు న్న సింగం 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
‘ఈ సినిమాలో అజయ్ పోలీసు అధికారి బాజీరావ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో కరీనాకపూర్ ప్రేయసి పాత్రలో కనిపిస్తుంది. గోవాలో 20 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మిగతా భాగమంతా ముంబైలో తీస్తాం. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే భాగాన్ని గోవా పరిసరాల్లో తీస్తున్నాం’ అని అన్నాడు. కాగా 2003లో జమీన్ సినిమాతో రోహిత్... బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. 11 ఏళ్ల తన కెరీర్లో రోహిత్ తీసిన అనేక సినిమాలు బాగా ఆడాయి. దీంతో అతడిని హిట్ మిషన్ అంటూ అంతా ప్రశంసిం చారు. ‘ఇలాంటి పొగడ్తలు బాగానే అనిపించినప్పటికీ అదే సమయంలో ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. నేను హిట్ సినిమాలు తీయాలని అంతా ఆకాంక్షిస్తారు. అయితే ఇందుకోసం ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది’అని అన్నాడు. సింగం 2 తర్వాత షారుఖ్ కథానాయకుడిగా రోహిత్ మరో సినిమా తీసే అవకాశముంది.
సరదాగా ఉంటుంది
Published Sun, May 18 2014 10:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement