
శ్రీసింహా
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్– క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ని హీరో ఎన్టీఆర్ ట్విట్టర్లో విడుదల చేసి, ‘‘కాలం వేగంగా పరిగెడుతోంది. నా తమ్ముళ్లు చాలా పెద్దవాళ్లు అయిపోయారు. శ్రీసింహాకు, కాలభైరవకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు.
చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ– ‘‘హాస్యంతో నిండిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మత్తు వదలరా’?. చివరి వరకూ ఆసక్తికరమైన కథనంతో సాగే మంచి కథను తెరకెక్కించాడు రితేష్. కథ అద్భుతంగా ఉండటం, యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని నిర్మించాం. సినిమాటోగ్రాఫర్గా సురేష్ సారంగం, స్టంట్ కో–ఆర్డినేటర్గా శంకర్, నటులుగా నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర వంటి కొత్తవారినెందరినో మా సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే చిత్రం టీజర్ను విడుదల చేస్తాం’’ అన్నారు. సత్య, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: పి.టి. గిరిధర్ రావు.