పోటీ లేకుండాపోయింది

jai lava kusha, spyder, paisa vasool no competition - Sakshi

గతేడాది సెప్టెంబర్‌ చివరి వారంలో ముగ్గరు పెద్ద హీరోల సినిమాలు ఒకే వారంలో బాక్సాఫీస్‌ వద్ద క్లాష్‌ అవుతాయనుకున్నారు. అవే.. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పైసా వసూల్‌’, మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు బైలింగ్వల్‌ ‘స్పైడర్‌’, బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేసిన ‘జై లవ కుశ’. అనుకున్నట్లుగా అయితే.. సెప్టెంబర్‌ 21న ‘జై లవ కుశ’, 27న ‘స్పైడర్‌’, ‘పైసా వసూల్‌’ రిలీజ్‌ కావాల్సింది. కానీ.. చెప్పిన టైమ్‌కన్నా ముందే ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ చేశారు చిత్రబృందం. ‘జై లవ కుశ’ స్టెప్టెంబర్‌ 21న, ‘స్పైడర్‌’ 27న వచ్చాయి. మొత్తం మీద పోటీ లేకుండాపోయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top