కోర్టుకెక్కిన హీరో విశాల్ | hero vishal approached madras high court | Sakshi
Sakshi News home page

కోర్టుకెక్కిన హీరో విశాల్

Jun 12 2015 3:24 PM | Updated on Sep 3 2017 3:38 AM

కోర్టుకెక్కిన హీరో విశాల్

కోర్టుకెక్కిన హీరో విశాల్

దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికలపై హీరో విశాల్ కోర్టుకెక్కారు.

చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికలపై హీరో విశాల్ కోర్టుకెక్కారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు అతడు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

శరత్ కుమార్, విశాల్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. శరత్ కుమార్ చర్యలను విశాల్ తరచుగా ప్రశ్నిస్తున్నారు. సంఘంపై తరచూ విమర్శలు చేస్తే విశాల్‌పై వేటు వేస్తామని శరత్‌కుమార్ హెచ్చరించారు. అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా? సంఘం నుంచి బహిష్కరించినా భయపడను అంటున్నారు నటుడు విశాల్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికల తేదీపై విశాల్ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement