తొమ్మిదేళ్లకే చూపు కోల్పోనున్న చిన్నారి

Girl Turns Blind For Using Smartphone In China - Sakshi

బీజింగ్‌: స్మార్ట్‌ఫోన్‌ వల్ల ఎన్ని అనార్థాలు ఉన్నాయో మరోసారి రుజువైంది. ఫోన్‌ను అతిగా వాడడం వల్ల ఓ చిన్నారి చూపు కోల్పోనుంది. చైనాలోని జియాంగ్జూ ప్రాంతానికి చెందిన జియావో అనే రెండేళ్ల బాలికకు కొద్ది రోజులుగా కళ్లు సరిగా కనిపించడంలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చిన్నారికి హ్రస్వదృష్టి ఏర్పడినట్లు తేల్చారు. చిన్నారి ఎదిగేకొద్ది ఈ సమస్య తీవ్రమై, 9 ఏళ్లు వచ్చేసరికి చూపు పూర్తిగా మసకబారిపోయే ప్రమాదముందని చెప్పారు. ఈ సమస్య తలెత్తడానికి కారణమేంటా? అని అన్వేషించగా.. జియావోకు ఏడాది వయసు నుంచే స్మార్ట్‌ ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకోవడం అలవాటని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆమె చూపు కోల్పోవడానికి కారణం స్మార్ట్‌ఫోనేనని వైద్యులు తేల్చారు. 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top