పాక్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి | Blast in Balochistan: 25 killed, many injured | Sakshi
Sakshi News home page

పాక్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి

May 13 2017 2:28 AM | Updated on Nov 6 2018 7:53 PM

పాక్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి - Sakshi

పాక్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడిలో పాకిస్తాన్‌ సెనెట్‌ డెప్యూటీ చైర్మన్‌ మౌలానా అబ్దుల్‌ ఘఫూర్‌ హైదరీ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. హైదరీ లక్ష్యంగానే ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. మస్తాంగ్‌ జిల్లాలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మౌలానా అబ్దుల్‌ ఘఫూర్‌ హైదరీ మసీదులో ముస్లింలనుద్దేశించి ప్రసంగించారు. ప్రార్థనల అనంతరం ఆయన తన కాన్వాయ్‌తో అక్కడ్నుంచి తిరిగివస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement