
దద్దరిల్లిన శాసనసభ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విపక్షం చేసిన ఆందోళనతో రాష్ట్ర శాసనసభ దద్దరిల్లింది.
- ప్రత్యేక హోదాపై చర్చకు అంగీకరించని ప్రభుత్వం
- ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర నిరసన
- పోడియం వద్ద విపక్ష సభ్యులను నెట్టేసిన మార్షల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం విపక్షం చేసిన ఆందోళనతో రాష్ట్ర శాసనసభ శుక్రవారం కూడా దద్దరిల్లింది. ప్రత్యేక హోదా అంశాన్ని చర్చకు రానీ యకుండా సీఎం స్టేట్మెంట్తో ‘మమ’ అనిపించాలని అధికారపక్షం, చర్చ ద్వారా చంద్రబాబు మెత క వైఖరిని ఎండగట్టాలని విపక్షం పట్టుదలతో వ్యవహరించాయి. ఉదయం 9 గంట లకు సభ ఆరంభం కాగానే ప్రశ్నోత్తరాలు ఆరంభిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వెంటనే వైఎస్సార్సీపీ సభ్యు డు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేచి ప్రత్యే క హోదాపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి స్టేట్మెం ట్ మీద రూల్స్ ప్రకారం క్లారిఫికేషన్లు ఇస్తారని, అయితే స్టేట్మెంట్పై చర్చకు అనుమతిస్తామని బీఏసీలో చెప్పామన్నారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుగజేసుకుని ‘‘నిన్న కౌన్సిల్లో జరి గిన చర్చ చూశాం... సభ ఆర్డర్లో లేకపోయినా సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. చివరకు క్లారిఫికేషన్లు అంటూ రెండు నిమిషాల్లో ముగించి వాయిదా వేశారు. ఈరోజు కూడా అదే పరిస్థితి వస్తుంది. దయచేసి చర్చకు అనుమతించండి. స్టేట్మెంట్కు మేం వ్యతిరేకం’’ అని స్పష్టం చేశారు. చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యుడు గడికోట శ్రీకాంత్రెడ్డి కూడా పదేపదే కోరారు.
వారి వ్యాఖ్యలపై ఆగ్రహం
సభలో రెండు పక్షాల సభ్యులు వాద ప్రతివాదాలు వినిపిస్తున్న సమయంలో యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీంతో ప్రతిపక్ష సభ్యులు పోడియంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా వెంటనే మార్షల్స్ ప్రవేశించి అడ్డుకున్నారు. విపక్ష సభ్యులు-మార్షల్స్ మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సభ వాయిదా వేశారు.
స్పీకర్ కంటే ముందే మార్షల్స్
తిరిగి 11.07 గంటలకు సభ పునఃప్రారంభమయ్యే సరికే (స్పీకర్ సభలోకి ప్రవేశించకముందే) పోడియం చుట్టూ మార్షల్స్ నిలబడ్డారు. విపక్ష నేత జగన్ టేబుల్ సమీపంలోనూ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా మార్షల్స్ సభలోకి రావడంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ మాజీ శాసనసభ్యుల మృతిపట్ల సంతాప సందేశం చదివారు. అనంతరం 11.10 గంటలకు స్పీకర్ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.