ఇద్దరు పిల్లలతో మెడికల్ షాపునకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన అసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్: ఇద్దరు పిల్లలతో మెడికల్ షాపునకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన అసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై గౌస్ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. అసిఫ్నగర్ జేబాబాగ్లో నిషాత్ ఉన్నీసా తన ఇద్దరు పిల్లలు జునైరా సుల్తానా (3), మిర్జాయిద్ అలీ (2) తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త ఆతేష్యామలీ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈనెల 6న సాయంత్రం 6 గంటలకు నిషాత్ ఉన్నీస తన పిల్లలతో కలిసి మెడికల్ షాపునకు వెళ్తున్నానంటూ కుటుంబసభ్యులకు తెలిపి బయలుదేరింది. ఈ మేరకు వాట్సప్లో భర్తకు మెసేజ్ పంపించింది. ఎంతకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన వారు బంధువుల వద్ద వాకబు చేసినా ప్రయోజనం కనిపించలేదు. శనివారం అసిఫ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.