ప్రైవేట్ బస్సు మాఫియాతో మా ప్రాణానికి ముప్పు! | we may lose our life, by private bus mafia | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ బస్సు మాఫియాతో మా ప్రాణానికి ముప్పు!

Jan 12 2014 4:48 AM | Updated on Sep 2 2017 2:31 AM

ప్రైవేట్ బస్సు మాఫియాతో తమకు ప్రాణహాని ఉందని పాలెం బాధిత కుటుంబాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ డి.సుధాకర్ అనుమానం వ్యక్తం చేశారు.

‘పాలెం’ బాధితుల జేఏసీ
 హైదరాబాద్, న్యూస్‌లైన్:  ప్రైవేట్ బస్సు మాఫియాతో తమకు ప్రాణహాని ఉందని పాలెం బాధిత కుటుంబాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ డి.సుధాకర్ అనుమానం వ్యక్తం చేశారు. హిమాయత్‌నగర్‌లో బస్సు ప్రమాద బాధితులతో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన తరువాత తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఈ విషయాన్ని డీజీపీకి దృష్టికి తీసుకురాగా, రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారని తెలిపారు.  బస్సు దుర్ఘటన జరిగి వందరోజులైన సందర్భంగా పాలెం వద్ద స్మారక స్థూపం నిర్మించనున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement