హైదరాబాద్‌లో సీఐఆర్‌డీఏపీ కేంద్రం


- ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని నేష నల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ పంచాయతీ రాజ్‌ (ఎన్‌ఐ ఆర్‌డీ అండ్‌ పీఆర్‌)లో సెంటర్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ఆసియా అండ్‌ పసిఫిక్‌ (సీఐఆర్‌డీఏపీ) కేంద్రం ఏర్పాటు కానుంది. దీనికోసం సీఐఆర్‌డీఏపీతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ఒప్పందం కుదుర్చు కునే ప్రతిపాదనకు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలి పింది. ఎన్‌ఐఆర్‌డీఅండ్‌ పీఆర్‌ ప్రాంగ ణంలో సీఐఆర్‌డీఏపీ  ఏర్పాటు వల్ల గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో నైపుణ్యం ఉన్న సంస్థల సమాచారంలో పలు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top