గ్రూప్-2 దరఖాస్తుల గడువు పెంపు | The deadline for applications to increase the Group -2: TSPSC | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 దరఖాస్తుల గడువు పెంపు

Sep 24 2016 6:07 AM | Updated on Sep 4 2017 2:40 PM

గ్రూప్-2 దరఖాస్తుల గడువు పెంపు

గ్రూప్-2 దరఖాస్తుల గడువు పెంపు

గ్రూపు-2 దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్సీ ఈనెల 26వ తేదీ వరకు పొడిగించింది.

హైదరాబాద్: గ్రూపు-2 దరఖాస్తుల గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా నెట్‌వర్క్ దెబ్బతినడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయని, దీంతో దరఖాస్తులను సబ్మిట్ చేయలేకపోయామని అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీకి విజ్ఞప్తి చేయడంతో దరఖాస్తుల గడువును పొడగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. శుక్రవారం దరఖాస్తుల చివరి తేదీ కావడంతో వేల మంది అభ్యర్థులు ఒకేసారి దరఖాస్తు చేయడంతో సర్వర్ డౌన్ అయింది.

దీంతో అనేక మంది అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసినా, ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయలేకపోయారు. అలాంటి వారంతా కూడా ఫీజు చెల్లించి దరఖాస్తులను సబ్మిట్ చేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం వరకు 5 గంటల వరకు 1.83 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. మరోవైపు గతంలోనే గ్రూపు-2 కోసం దరఖాస్తు చేసుకున్న వారు 5.65 లక్షల మంది ఉన్నారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య 7.48 లక్షలకు చేరుకుంది. ఈ సంఖ్య ఈనెల 26వ తేదీ నాటికి మరింతగా పెరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement