సైనిక్పురిలో జరిగిన ప్రూడెన్షియల్ షుగర్స్ సంస్థ వార్షిక సమావేశం ఉద్రిక్తతకు వేదికయింది.
ప్రూడెన్షియల్ షుగర్స్ సమావేశంలో ఉద్రిక్తత
Dec 30 2016 12:58 PM | Updated on Sep 4 2017 11:58 PM
హైదరాబాద్: సైనిక్పురిలో జరిగిన ప్రూడెన్షియల్ షుగర్స్ సంస్థ వార్షిక సమావేశం ఉద్రిక్తతకు వేదికయింది. శుక్రవారం మధ్యాహ్నం సమావేశం ప్రారంభమైన వెంటనే టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడారు. ముందుగా నోటీసులివ్వకుండా షేర్హోల్డర్లు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో ఆయన్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఇరువర్గాల మధ్య వాదులాట, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు వర్గాల వారిని సముదాయించారు.
Advertisement
Advertisement