'మీరు మాట్లాడితే సంస్కారం.. మేం మాట్లాడితే..' | telangana assembly sessions | Sakshi
Sakshi News home page

'మీరు మాట్లాడితే సంస్కారం.. మేం మాట్లాడితే..'

Mar 19 2016 5:52 PM | Updated on Mar 18 2019 9:02 PM

'మీరు మాట్లాడితే సంస్కారం.. మేం మాట్లాడితే..' - Sakshi

'మీరు మాట్లాడితే సంస్కారం.. మేం మాట్లాడితే..'

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ప్పటి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది 2.53 గంటలు కాగా టీఆర్‌ఎస్ మాట్లాడింది అందులో సగం సమయమేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ప్పటి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది 2.53 గంటలు కాగా టీఆర్‌ఎస్ మాట్లాడింది అందులో సగం సమయమేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో శనివారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పదేళ్ల కాంగ్రెస్ హయంలో, 20 నెలల టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, అందుకు వెచ్చించిన నిధులపై పోలుస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి, బీజేపీ పక్ష నేత కె.లక్ష్మణ్ అడ్డుపడ్డారు. కాంగ్రెస్ హయంలో రాబడి, ఖర్చుకు ప్రస్తుత పరిస్థితికి తేడా ఉందని జానారెడ్డి చెప్పగా, బీజేఎల్‌పీ నేత లక్ష్మణ్ ‘కాంగ్రెస్ హయంలో చేయలేదనే మిమ్ములను(టీఆర్‌ఎస్) గెలిపించారని, పోలిక ఎందుక’ ని అభ్యంతరం చెప్పారు.

ఈ విషయంలో ఈటెలకు, ప్రతిపక్ష సభ్యులకు వాగ్వివాదం జరుగుతుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. ‘అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాన్ని విని సంస్కారవంతంగా వ్యవహరించాలని జానారెడ్డి చెప్పారు. మీరు మాట్లాడితే సంస్కారం, మేం మాట్లాడితే కుసంస్కారమా? ఆర్థిక మంత్రి వివరాలు తెలియజేస్తున్నారు. ఓపిగ్గా వినండి. అభ్యంతరాలు ఉంటే క్లారిఫికేషన్స్‌లో మాట్లాడండి’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు (శనివారం మధ్యాహ్నం) వరకు సభలో టీఆర్‌ఎస్ సభ్యులు కేవలం గంటా 26 నిమిషాలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు 2 గంటల 53 నిమిషాలు మాట్లాడారని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement