వైఎస్సార్ కాంగ్రెస్పై టీడీపీ నేతల ధ్వజం
శాంతిభద్రతలపై అసెంబ్లీలో ప్రతిపక్షం చర్చకోరడం అర్థరహితం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలను హత్యలు చేయిస్తోందని ప్రతిపక్షం ఆరోపించడంలో అర్థం లేదని.. సాధారణ హత్య కేసులను టీడీపీ ఖాతాలో వేసి సానుభూతి పొందేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర కార్మికమంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
ఆయన సోమవారం శాసనసభ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ అనేక ప్రజా సమస్యలున్నాయని.. ప్రధాన ప్రతిపక్షం గా వాటిపై చ ర్చించడం మాని, శాంతిభద్రతల పై చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం కోరడం అర్థరహితమని విమర్శించా రు. పదమూడు జిల్లాల్లో టీడీపీ ఎవరిని చంపిం చిందో, ఎక్కడ చనిపోయారో వారి పేర్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
పరిటాల రవి కేసులో ప్రధాన ముద్దాయిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయనను తప్పించారని ఆరోపించారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక 226 మందిని రాజకీయంగా చంపిస్తే అందులో తమ పార్టీ వారు 120 మంది ఉన్నారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విభజన తరువాత కీలకంగా జరిగే బడ్జెట్ సమావేశాలకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని.. ఇలాంటి స్థితిలో సమస్యలపై పోరుబాట పట్టకుండా.. ఫ్యాక్షన్ రాజకీయాలకు జగన్ ఆజ్యం పోసి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. అందర్నీ సమంగా చూస్తుంటే శాంతిభద్రతలు అడుగంటాయని ప్రతిపక్షం బురద చల్లుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక గొడవల్లో మరణించిన వారివి హత్యలయిపోతాయా? అని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రశ్నించారు.
హత్యలన్నీ టీడీపీవే అంటే ఎలా?
Published Tue, Aug 19 2014 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement