జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
సాక్షి, హైదరాబాద్ : జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల ముఠాను పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నగరంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 50 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 30 వేల నగదు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన నలుగురు తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.