హైదరాబాదీ పేరుతో బెంగళూరు వాసి ఎత్తుగడ
ఐదేళ్లుగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగం
ఇంటర్వ్యూకు వెళ్లి వేరే వారి సర్టిఫికెట్లు చోరీ
గుట్టురట్టు చేసి ‘బ్యాంకు రుణం’ దరఖాస్తు
సిటీబ్యూరో: సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరే కనీస అర్హత లేని ఇర్ఫాన్ అనే ఓ వ్యక్తి ప్రముఖ సంస్థలో రవి శంకర్ శర్మ పేరుతో క్వాలిటీ మేనేజర్గా మారాడు. అదెలా సాధ్యమైంది? చివరకు ఏ రకంగా గుట్టురట్టైంది? బెంగళూరులో జరిగిన ఈ వ్యవహారంతో అసలు మన నగరానికి సంబంధం ఏమిటి..? ఈ ప్రశ్నలకు జవాబులతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
గోవా నుంచి వచ్చి బెంగళూరులో...
బెంగళూరు ఆర్టీ నగర్ పరిధిలోని గంగానగర్లో నివసిస్తున్న మహ్మద్ ఇర్ఫాన్ స్వస్థలం గోవా. పదో తరగతి పూర్తయ్యాక డిప్లమో కోర్సులో చేరిన ఇతగాడు ఆర్థిక కారణాలతో డ్రాప్ఔట్గా మారాడు. బతుకుతెరువు కోసం తన తల్లితో కలిసి కర్ణాటకకు వలస వచ్చి బెం గళూరులో స్థిరపడ్డాడు. పూర్తై పదో తరగతి, పూర్తి కాని డిప్లమోకు సంబంధిం చిన సర్టిఫికెట్లతో బెంగళూరులో ఉద్యోగ వేట ప్రారంభించాడు. కనీస విద్యార్హతలు లేకపోవడంతో సుదీర్ఘకాలం ప్రయత్నించినా ఎక్కడా ప్లేస్మెంట్ లభించలేదు. అయినా ఇంటర్వ్యూలకు వెళ్లడం మాత్రం మానుకోలేదు.
సర్టిఫికెట్లు తస్కరించి రవి శంకర్గా..
హైదరాబాద్లోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నతోద్యోగం చేస్తున్న రవి శంకర్ శర్మ 2008లో బెంగళూరులో ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇదే ఇం టర్వ్యూకు వచ్చిన ఇర్ఫాన్.. రవి శంకర్తో మాటలు కలిపాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి బయటకు వెళ్లినప్పుడు అదును చూసుకుని శంకర్కు చెందిన సర్టిఫికెట్లు, ఇతర యోగ్యతా పత్రాలను ఇర్ఫాన్ తస్కరించాడు. తిరిగి వచ్చిన రవి శంకర్ ఆయా విద్యా సంస్థల నుంచి డూప్లికేట్ పత్రాలు తీసుకున్నారు. శంకర్ పత్రాలను తస్కరించిన ఇర్ఫాన్ వాటిపై తన ఫొటోలను పెట్టి ఫోర్జరీ పత్రాలు రూపొందించాడు. వీటి ఆధారంగా తన పేరు రవి శంకర్ శర్మ అంటూ 2010లో బెంగళూరులోని ఎంఫసిస్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆ తరవాత మరో ప్రముఖ సంస్థ కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్లో క్వాలిటీ మేనేజర్గా చేరాడు.
సీఐబీఐఎల్ డేటాబేస్ ఆధారంగా...
తన పేరిట మరెవరో క్రెడిట్కార్డులు, బ్యాంకు రుణం తీసుకున్నారని గుర్తిం చిన రవి శంకర్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ (సీఐబీఐఎల్)ను ఆశ్రయించారు. బ్యాంకు రుణాల డిఫాల్టర్ల డేటాబేస్ను పర్యవేక్షించే ఈ సంస్థ బెంగళూరులో రుణం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని బాధితుడు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల మేరకు బెంగళూరులోని సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు రుణం, క్రెడిట్ కార్డుల చెల్లిం పులు కన్వర్గైస్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఓ శాలరీ అకౌంట్ నుంచి జరిగినట్లు గుర్తించిన సీసీబీ ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. దీంతో అతడు అన్ని విషయాలు బయటపెట్టడంతో గతనెల 14న అరెస్టు చేసింది. అసలు పేరుతో ఉన్న ఓటర్ ఐడీ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇర్ఫాన్ అయ్యాడు శంకర్!
Published Fri, Oct 2 2015 12:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement