శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
రూ. 75 లక్షల విలువైన బంగారం స్వాధీనం
Apr 20 2017 11:00 AM | Updated on Sep 5 2017 9:16 AM
రంగారెడ్డి: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపడుతున్న కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 75 లక్షల విలువైన రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. జెడ్డ నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement