తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
52 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
Nov 10 2016 2:46 PM | Updated on Sep 4 2018 5:24 PM
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గేట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 16 లక్షలు విలువైన 52 తులాల బంగారు ఆభరణాలతో పాటు అర కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు స్టేషన్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కోటేశ్వర్రావును గురువారం అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ. 16 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతని పై పలు స్టేషన్ల పరిధిలో 18 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement