8.5 కిలోల బంగారం పట్టివేత | 8.5 kg of gold seized | Sakshi
Sakshi News home page

8.5 కిలోల బంగారం పట్టివేత

Oct 7 2015 6:59 PM | Updated on Sep 4 2018 5:16 PM

బారీ ఎత్తున బంగారంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

బారీ ఎత్తున బంగారంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎనిమిదిన్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన గోపాల్, జోగీందర్‌సింగ్ బుధవారం ఉదయం బాలానగర్‌లోని సామ్రాట్ హోటల్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.

వీరు 8.5 కిలోల బంగాన్ని హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకువచ్చారు. సమాచారం అందడంతో సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం సాయంత్రం సామ్రాట్ హోటల్‌లో మకాం వేసిన గోపాల్, జోగీందర్‌సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి బిల్లులు, పన్నులు కట్టినట్టు ఆధారాలు లేకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement