జవహర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో మంగళవారం చైన్ స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది.
జవహర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో మంగళవారం చైన్ స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. కూతుర్ని స్కూలుకు తీసుకువెళ్తున్న ఓ మహిళను గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అడ్డగించి మూడున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.