ములాయం సింగ్తో కేటీఆర్ భేటీ | KTR meets Mulayam Singh Yadav | Sakshi
Sakshi News home page

ములాయం సింగ్తో కేటీఆర్ భేటీ

Oct 15 2015 7:12 PM | Updated on Jul 18 2019 2:11 PM

ములాయం సింగ్తో కేటీఆర్ భేటీ - Sakshi

ములాయం సింగ్తో కేటీఆర్ భేటీ

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు  ములాయం సింగ్ తో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భేటీ అయ్యారు. వీరి భేటీలో  బిహార్ ఎన్నికలు, దేశ రాజకీయాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకోసం కేటీఆర్ పడే తపనను ములాయం అభినందించారు. భవిష్యత్ లో కేటీఆర్ కీలక రాజకీయ నేతగా ఎదుగుతారని ప్రశంసించారు.

కాగా కేటీఆర్ ఇవాళ ఉదయం యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై అఖిలేష్ ఆసక్తి కనబరిచారు. దీంతో అఖిలేష్ ఆహ్వానం మేరకు ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ బృందం ఆయనకు తెలియజేయనుంది. కేటీఆర్తో పాటు అధికారులు రేమండ్ పీటర్, సురేందర్ రెడ్డి లక్నోలో పర్యటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement