శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన | Indigo airlines stops passengers in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Apr 14 2016 9:36 AM | Updated on Apr 7 2019 3:24 PM

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు గురువారం ఉదయం ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో  ప్రయాణికులు గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. బెంగుళూరు మీదగా కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు  ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను బోర్డింగ్కు అనుమతించకుండా సిబ్బంది  కౌంటర్  మూసివేశారు.

దీంతో శబరిమల వెళ్లాల్సిన 15మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరుకు ఒక్కసారిగా రష్ పెరగటంతో ఇండిగో సంస్థ ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకుని కౌంటర్ మూసివేసింది. దీంతో ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. ప్రయాణంపై తమకు సరైన సమాధానం ఇవ్వటం లేదంటూ ఇండిగో యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement