పెళ్లిచేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకుని గర్భం దాల్చిన తర్వాత ముఖం చాటేసిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది.
ఈ క్రమంలోనే నెలరోజులుగా ఫిలింనగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ సాయి గెస్ట్హౌజ్కు తీసుకువెళ్లి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ నెల 27వ తేదీన యువతి గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని కిషోర్కు చెప్పి తనను వెంటనే పెళ్లిచేసుకోవాలని కోరింది. దీనికి కిషోర్ నిరాకరించడంతో పాటు తాను కేవలం ఎంజాయ్ చేయడానికే నీతో ఉన్నాను తప్ప పెళ్లిచేసుకునేందుకు కాదంటూ ఎదురుదాడికి దిగాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మణిపై ఐపీసీ సెక్షన్ 506, 420 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.