‘ఆపరేషన్ ఆర్కే కాదు...ఆపరేషన్ మైనింగ్’ | ap government hunting for RK, sasy Varavara Rao | Sakshi
Sakshi News home page

పేర్లు ఏవైనా చంపడమే లక్ష్యంగా...

Oct 28 2016 10:05 AM | Updated on Mar 28 2019 5:07 PM

‘ఆపరేషన్ ఆర్కే కాదు...ఆపరేషన్ మైనింగ్’ - Sakshi

‘ఆపరేషన్ ఆర్కే కాదు...ఆపరేషన్ మైనింగ్’

మైనింగ్ కంపెనీలతో చేసుకున్న ఎంవోయులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ ఆర్కే కొనసాగిస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు.

హైదరాబాద్ : మైనింగ్ కంపెనీలతో చేసుకున్న ఎంవోయులో భాగంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆపరేషన్ ఆర్కే కొనసాగిస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ‘ఆపరేషన్ ఆర్కే కాదు... ఆపరేషన్ మైనింగ్. ఆధారాలు లేకుండా మేం ఎప్పుడూ ఆరోపించం. లొంగిపోయిన దళ సభ్యుడు ఇచ్చిన సమచారం మేరకే ఈ ఆపరేషన్ జరిగింది. పేర్లు ఏవైనా చంపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగిస్తోంది. మావోయిస్టు మృతదేహాల పోస్టుమార్టంలో స్పష్టం లేదు’ అని అన్నారు.

ఏవోబీలో బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్కేతో పాటు రవిలను తక్షణమే కోర్టులో హాజరు పరచాలన్నారు. అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్‌ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్‌కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్‌గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement