పిల్లలను హతమార్చి, అనంతరం ఆత్మహత్య | mother comits sucide along with two children | Sakshi
Sakshi News home page

పిల్లలను హతమార్చి, అనంతరం ఆత్మహత్య

Nov 3 2015 7:31 AM | Updated on Apr 4 2019 4:44 PM

ఇద్దరు చిన్నారులు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా సందుర్తి మండలం బెస్తరపల్లిలో విషాదాన్ని నింపింది.

కందుర్పి: భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను నీటి తొట్టిలో వేసి అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నరేష్(29) పంచాయతి సెకెట్రరీగా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల క్రితం లక్ష్మి(25)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు(భరత్(2), ఎనిమిది నెలల బాబు).

గత కొన్ని రోజులుగా భర్త సరిగ్గా ఇంటికి రాకపోవడం, మరో యువతితో వివాహేతర సంబందాన్ని కొనసాగిస్తున్నాడని లక్ష్మికి తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఎంత చెప్పిన భర్త తన తీరు మార్చుకోక పోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మి సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తన ఇద్దరు పిల్లలను బాత్రూంలో ఉన్న నీటి తొట్టిలో వేసి అనంతరం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement