గువాహటి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన గువాహటి ఎక్స్ప్రెస్ వర్షం కారణంగా నిలిచి పోయింది.
నిలిచిన గువాహటి ఎక్స్ప్రెస్
Dec 2 2015 11:49 AM | Updated on Oct 20 2018 6:19 PM
దొరవారిసత్రం: గువాహటి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన గువాహటి ఎక్స్ప్రెస్ వర్షం కారణంగా నిలిచి పోయింది. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన రైల్వే యంత్రాంగం రైలును స్టేషన్లో నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Advertisement


