పరిగి ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి | cm kcr condolence to road-accident-in-rangareddy-district | Sakshi
Sakshi News home page

పరిగి ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

Mar 30 2016 1:22 PM | Updated on Aug 14 2018 10:54 AM

రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివాహ వేడుకకు వెళ్తూ నలుగురు మృతిచెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా, ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement