ఇన్నోవా బోల్తా: నలుగురి మృతి | 4 dead, 2 injured in road accident at mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఇన్నోవా బోల్తా: నలుగురి మృతి

Oct 23 2015 10:39 AM | Updated on Aug 30 2018 3:56 PM

మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

పెబ్బేరు: మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఇన్నోవా వాహనం బోల్తాపడిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ నగరానికి చెందిన కొందరు ఇన్నోవా వాహనంలో కర్నూలు వైపు వెళ్తున్నారు. వారి వాహనం పెబ్బేరు మండలం రంగాపురం సమీపంలోని పెట్రోలు బంక్ వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది.

ఈఘటనలో వాహనంలోని ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి,  బాలుడు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement