ఏనుగంత సమస్య... దూదిపింజలా తేలిపోయింది! | "Wildlife Research and the Conservative Society ' | Sakshi
Sakshi News home page

ఏనుగంత సమస్య... దూదిపింజలా తేలిపోయింది!

Oct 13 2016 10:41 PM | Updated on Sep 4 2017 5:05 PM

ఏనుగంత సమస్య... దూదిపింజలా తేలిపోయింది!

ఏనుగంత సమస్య... దూదిపింజలా తేలిపోయింది!

ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది. మొన్నటి వరకు పరమ శత్రువులుగా భావించిన ఏనుగులను వారిప్పుడు పరమ

ఐడియా


ఒక ఐడియా వారి జీవితాలనే మార్చేసింది. మొన్నటి వరకు పరమ శత్రువులుగా భావించిన ఏనుగులను వారిప్పుడు పరమ మిత్రులుగా భావిస్తున్నారు. ఏనుగు బొమ్మలతో తయారు చేసిన కళాకృతులు వారి జీవితాల్లో కొత్త కాంతులు నింపుతున్నారుు. అక్కడి మనుషుల ప్రాణాలతోపాటు వారి వ్యవసాయ పంటలను విధ్వంసం చేస్తూ వచ్చిన గజరాజులు ఇప్పుడు వారికి, వారి పంటలకు దూరంగా మసలుతున్నారుు. ‘వైల్డ్‌లైఫ్ రీసెర్చ్ అండ్ కన్జర్వేటివ్ సొసైటీ’ ఒక ఐడియాతో కర్ణాటకలోని సిద్దూ కమ్యూనిటీ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చింది.


సిద్దూ తెగకు చెందిన ఈ గిరిజనులు దేశవ్యాప్తంగా 55 వేల మంది ఉండగా, కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వారంతా ఎల్లాపూర్ వైల్డ్ ఫారెస్ట్‌కు సమీపంలోని గడ్గెరా లాంటి గ్రామాల్లో నివసిస్తున్నారు. వారి వ్యవసాయ భూములన్నీ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో తరచు ఏనుగుల మంద వారి పంటలపై దాడిచేసి విధ్వంసం సృష్టించేవి. మనుషులను కూడా పొట్టనపెట్టుకునేవి.

 
ఏనుగుల దాడుల్లో ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఏటా 25 నుంచి 30 మంది మరణిస్తున్నారు. మనుషుల ప్రతీకార దాడుల్లో ఏటా దాదాపు 100 ఏనుగులు మరణిస్తున్నారుు. అయితే ఏనుగులను చంపాల్సిన అవసరం లేకుండా, వాటి చేతుల్లో చావకుండా ఎన్నో సులభమైన మార్గాలను వన్యప్రాణి సంరక్షణ అధికారులు సిద్దూ తెగ గిరిజనులకు సూచించారు. ఏనుగులను పరమ శత్రువులుగా భావిస్తున్న ఆ గిరిజనులు ఏనుగులు తమకు కనిపిస్తే చాలు, ప్రాణం పోరుునా వాటిని చంపేస్తామని  తీర్మానించుకున్నారు.

 
ముందుగా వారి ఆలోచనల్లో మార్పు తీసుకొస్తే తప్ప వారి వైఖరిలో మార్పు రాదని భావించిన అధికారులు ‘ఐరావత్’ పేరిట ఓ పథకాన్ని చేపట్టారు. అందుకు సిద్దూ తెగకు చెందిన మహిళలను ఎంపిక చేసుకున్నారు. వారికి రుమాలు నుంచి తువ్వాలువరకు దుస్తులపై ఏనుగు బొమ్మలను అల్లడం. వాటిపై ఏనుగుల ఆకారంలో పూసలను గుచ్చడం, ఏనుగు బొమ్మలతో కీచైన్లు తయారు చేయడం, కారు అద్దాల ముందు వేలాడేసుకొనే ఏనుగు బొమ్మలను తయారు చేయడం లాంటి చేతికళలను నేర్పించారు. వాటి తయారీకి ముడిసరుకులను సరఫరా చేశారు. తయారు చేసిన వస్తువుల కు మార్కెట్ కూడా చూపించారు. ఆ గిరిజన మహిళలకు గిట్టుబాటు అవుతోంది. వారంతా స్వయంపోషక బృందాలుగా ఏర్పాటి ముడి సరకులు కొనుగోలు నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ వారే చూసుకుంటున్నారు. తమకు ఇంత ఆదాయాన్ని తీసుకొస్తున్న ఏనుగుపట్ల వారికి ఆరాధ్యభావం ఏర్పడింది. వారి భర్తల వైఖరి కూడా మారిపోరుుంది. అధికారులు సూచించిన ప్రకారం వారు ఏనుగులు పొలాల వద్దకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమ ఐడియా ఫలించినందుకు అధికారుల ఆనందానికి అంతులేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement